Jawan Missing: 



కుల్గం జిల్లాలో అదృశ్యం..


జమ్ముకశ్మీర్‌లోని కుల్గం జిల్లాలో ఓ ఆర్మీ జవాన్ అదృశ్యమయ్యాడు. ఆర్మీ అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. అచ్చత్ ఏరియాకు చెందిన జావేద్ అహ్మద్ వని శనివారం (జులై 29) సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. లద్దాఖ్‌ రీజియన్‌లో పహారా కాస్తున్న జావేద్ కార్ పరనహల్‌ ప్రాంతంలో దొరికింది. ఆర్మీ అతడి ఆచూకీ కోసం గాలిస్తోంది. కార్‌లో రక్తపు మరకలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సరుకులు కొనేందుకు కార్‌లో వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని ఆర్మీ వెల్లడించింది. పరిసర గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. కార్‌కి లాక్ వేసి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధితుడి చెప్పులు కూడా కార్‌లోనే ఉండిపోయాయి.