పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. తిరుపతి జిల్లా సూళ్లూరు పేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం (జూలై 30) ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ56 ప్రయోగాన్ని నిర్వహించారు. కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా 6.31 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు ఉన్న ఏడు శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. 


పీఎల్ఎల్వీ సీ-56 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.