Rahul Gandhi On Modi Speech: 2 గంటల స్పీచ్ లో మణిపూర్ పై కేవలం 2 నిమిషాలేనా? ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు

Rahul Gandhi On PM Modi Speech: భారతదేశం ప్రజలు ప్రేమ, ఆప్యాయతలకు చిరునామా అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబం అంటే ఏమిటో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థం కాదని విమర్శించారు. 

Continues below advertisement

Rahul Gandhi On PM Modi Speech: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పార్లమెంట్ నియోజకవర్గమైన వయనాడ్‌లో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మణిపూర్‌లో తన పర్యటన గురించి.. అక్కడి భయంకరమైన పరిస్థితిని వివరించారు. మణిపూర్ అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ విభజన విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

Continues below advertisement

మణిపూర్‌లో ప్రతిచోటా రక్తం పారుతోందని,  హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంటులో ప్రధాని 2 గంటల 13 నిమిషాలు ప్రసంగిస్తే మణిపూర్‌లో 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించకుండా ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేస్తే ఆయన మంత్రి వర్గం నవ్వుతోందని విమర్శించారు. భారతదేశం అనే కుటుంబాన్ని బీజేపీ నాశనం చేయాలని చూస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 

మణిపూర్ మహిళలపై జరిగిన ఎన్‌కౌంటర్ల గురించి, తను అనుభవించిన బాధ గురించి మాట్లాడుతూ.. మణిపూర్‌పై ఎవరో కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను 19 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలు తన జీవితంలో మొదటిదన్నారు. వరదలు, అల్లర్లు, సునామీలు ఇతర విషాద సమయాల్లో దేశమంతటా పర్యటించానని, కానీ మణిపూర్‌లో జరిగిన దారుణాలు ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నారు. 

వయనాడ్ తన కుటుంబమన్నారు. మణిపూర్‌లో చూసినదాన్ని ప్రజలకు చెప్పడం తనకు ముఖ్యమన్నారు. అందరి గురించి చెప్పలేనని, కానీ రెండు ఘటనలను మాత్రం ఉదాహరణలుగా చెప్తామన్నారు. రెండు ఘటనలలో మణిపూర్ స్త్రీలు ఉన్నట్లు చెప్పారు. సహాయ శిబిరాల్లో తాను పలువురు మహిళలను పరామర్శించినట్లు చెప్పారు. ఓ గదిలో  ఒక స్త్రీ నేలపై ఒంటరిగా పడుకుని ఉందన్నారు. మిగతా వారికి ఎవరో ఒకరు తోడుగా ఉన్నట్లు చెప్పారు. ఆమెను పరామర్శించినప్పుడు మహిళ చెప్పిన విషయాలు తెలుసుకుని తన మనసు చలించిపోయిందన్నారు. 

'మీ కుటుంబం ఎక్కడ ఉంది?' అని మహిళను  రాహుల్ గాంధీ అడగ్గా తనకు కుటుంబం అంటూ లేదని సమాధానం ఇచ్చిందన్నారు. ఏమైందని మరో సారి అడుగ్గా ఆమె కాసేపు సమాధానం చెప్పలేక పోయిందని, తాను ఆమె చేయి పట్టుకుని ఆరా తీయగా సంచలన విషయం చెప్పిందన్నారు. మహిళ తన ఊరిలో ఇంట్లో కొడుకుతో కలిసి నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారని, తన కళ్ల ముందే కొడుకును దారుణంగా హత్య చేశారని, రాత్రంతా అతని మృతదేహం పక్కనే పడి ఏడూస్తూ గడిపినట్లు మహిళ చెప్పిందని ఉద్వేగభరితంగా చెప్పారు. 

మరో విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి కథను మరొక మహిళ చూసింది. మణిపూర్‌లో ఎవరో పారాఫిన్ పోసి తగులబెట్టినట్లు అనిపించింది. ఆమెకు ఏమి జరిగిందని నేను ఇతర మహిళను అడగగా, ఆమె స్పృహతప్పి పడిపోయిందన్నారు. మన కుటుంబంలో అమ్మ లేదా సోదరికి ఇలా జరిగితే మనం భరించగలమా అని అడిగారు. భారతదేశం ప్రజల మధ్య శాంతిని సూచిస్తుందని, హింస, ద్వేషం ఉంటే అది భారతదేశం కాదన్నారు. భారతదేశం ప్రజలు ప్రేమ, ఆప్యాయతలకు చిరునామా అన్నారు. కుటుంబం అంటే ఏమిటో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థం కాదని విమర్శించారు. 

ఎంపీ హోదా పునరుద్ధరణ తర్వాత గాంధీ తన మొదటి ప్రసంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కుటుంబ విధానాన్ని గ్రహించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రజలను విభజించడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ప్రజలను మరింత దగ్గర చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయన్నారు. రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించడం ద్వారా వాయనాడ్‌తో సంబంధాలు తెగిపోతాయని వారు భావిస్తున్నారని, కానీ ఇటువంటి చర్యలతో నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఎంపీగా తిరిగి నియమితులైన తర్వాత రాహుల్ మొదటి సారిగా అధికారికంగా పర్యటించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola