Watch Video:
పుణేలో హిరోషి పర్యటన..
జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి భారత్ పర్యటనకు వచ్చారు. మహారాష్ట్రలోని పుణేలో సరదాగా తన సతీమణితో కలిసి సందడి చేశారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఆస్వాదించారు. మహారాష్ట్రలో ఫేమస్ అయిన వడాపావ్నీ ఎంజాయ్ చేశారు. అంతే కాదు. హిరోషి సుజుకి దంపతులు పోటీ కూడా పెట్టుకున్నారు. "ఎవరు ఎక్కువ వడాపావ్లు తింటారో చూద్దాం" అని ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ పోటీలో హిరోషి సతీమణి విన్ అయినట్టు ఫన్నీగా ట్వీట్ చేశారు. "నా వైఫ్ ఈ విషయంలో నన్ను మించిపోయింది" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పలు చోట్ల ఇద్దరూ కలిసి వడాపావ్ తింటూ కనిపించారు. తన సతీమణి వడాపావ్ని వేగంగా తినేస్తుంటే పక్కనే కూర్చుని చూస్తున్నారు హిరోషి. వడాపావ్ ఒక్కటే కాదు. ఇంకా చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ని రుచి చూశారు. అయితే...ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "ఇలాంటి పోటీల్లో ఓడిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
"కొన్నిసార్లు ఓడిపోయినా మనకు పెద్దగా బాధ అనిపించదు. అలాంటి కాంపిటీషనే ఇది. మీరిద్దరూ ఇండియన్ ఫుడ్ని ఆస్వాదిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇంత ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేయడం ఇంకా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయండి"
- ప్రధాని నరేంద్ర మోదీ