Covid Update: దేశంలో కొత్తగా 3,275 కరోనా కేసులు నమోదుకాగా 55 మంది మృతి చెందారు. 55 మంది మృతుల్లో 52 మంది కేరళకు చెందినవారే. రోజువారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,719గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4,30,91,393కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 






మొత్తం మరణాల సంఖ్య 5,23,975కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05కు పెరిగింది. రికవరీ రేటు 98.74గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.77గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.78గా ఉంది. 


మహారాష్ట్ర 


మహారాష్ట్రలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,78,363కు పెరిగింది. ఒక్క ముంబయిలోనే 117 కరోనా కేసులు వచ్చాయి.


వ్యాక్సినేషన్







బుధవారం ఒక్కరోజే 13,98,710 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 1,89,63,30,362 డోసుల టీకా పంపిణీ చేసింది. బుధవారం 4,23,430 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 83.93 కోట్లు దాటింది.


Also Read: Rakesh Biyani Resigns: ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ రాజీనామా


Also Read: Russia Ukraine War: సిమ్యులేటెడ్ న్యూక్లియర్ క్షిపణి దాడులు చేసిన రష్యా - యుద్ధం జరుగుతున్న వేళ కీలక ప్రకటన