Covid Update: దేశంలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,927 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 16,279కి చేరింది. పాజిటివిటీ రేటు 0.58%కి పెరిగింది. 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు.






32 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5,23,654కు చేరింది.


సీఎంలతో భేటీ


దేశంలో కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరోనా పరిస్థితులపై ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 


వ్యాక్సినేషన్







దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 21,97,082 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,89,19,40,971కు చేరింది.