Watch Video: 


పుణె రైల్వే స్టేషన్‌లో ఘటన..


పుణె రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వాళ్లపై ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసిన వీడియో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఓ యూజర్ దీన్ని షేర్ చేశాడు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)కి చెందిన ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో అందరి ముఖంపై నీళ్లు కొట్టాడు. దీనిపై నెటిజన్లు మండి పడ్డారు. "మానవత్వమే లేదా.." అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో పుణె డివిజనల్ రైల్వే మేనజర్ వరకూ వెళ్లింది. ఇది చూసిన వెంటనే ఆయన అసహనానికి లోనయ్యారు. ఇలా జరగడం పట్ల ఆమె క్షమాపణలు చెప్పారు. 






"ప్లాట్‌ఫామ్‌పై అలా పడుకోవడం వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే వాళ్లతో వ్యవహరించాల్సిన తీరు అది కాదు. మిస్‌ హ్యాండిల్ చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఆ పోలీస్‌ని మందలించాం. ప్యాసింజర్స్‌తో మర్యాదగా నడుచుకోవాలని చెప్పాం. ఇలా జరగడం చాలా బాధాకరం"


- ఇందూ దూబే, పుణె డివిజనల్ రైల్వే మేనేజర్






ఇప్పటికే ఈ వీడియోకి 20 లక్షల వ్యూస్‌ రాగా..11 వేల లైక్స్ వచ్చాయి. కామెంట్స్ సెక్షన్‌ అయితే మారుమోగి పోతోంది. కొంత మంది ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ ఉన్నతాధికారులనూ ట్యాగ్ చేశారు. 


"వెయిటింగ్ రూమ్స్ సంఖ్య పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అదే జరిగితే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పై పడుకోవాల్సిన దుస్థితి ఉండదు. అంతే కాదు. రైళ్లు కూడా సమయానికి రావాలి"


-  ఓ నెటిజన్ కామెంట్ 


Also Read: Gas Cylinder Price: ఈ నెలలోనూ 'బండ' భారం భరించాల్సిందే - వంట గ్యాస్‌ కొత్త రేట్లివి