Agnipath Protests: అగ్నిపథ్ సెగలు- బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు

Agnipath Protests: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. బిహార్, యూపీలో పలు రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు.

Continues below advertisement

Agnipath Protests: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌పై మూడో రోజూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. బిహార్‌, ఉత్తర్​ప్రదేశ్​లలో శుక్రవారం ఉదయం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.

Continues below advertisement

యూపీలో

ఉత్తర్​ప్రదేశ్​లోని బాలియా రైల్వే స్టేషన్​ ముందు నిరసన చేపట్టారు ఆందోళనకారులు. కొందరు దుండగులు రైల్వే స్టేషన్​లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు​.

బిహార్‌లో

బిహార్‌లోని లఖీసరాయ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం ఐదు కంపార్ట్‌మెంట్లు కాలిపోయాయి. ఆందోళనకారులు నిప్పుపెట్టడం వల్ల రైల్లోని ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. లఖ్మీనియా రైల్వే స్టేషన్​కు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. రైల్వే ట్రాక్‌పై టైర్లు పెట్టి నిప్పుపెట్టారు. 

అగ్నిపథ్ విధానాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేపడతామని, వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు

Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది

Continues below advertisement