ABP-CVoter Opinion Poll: రాహుల్ గాంధీ, ఖర్గే పనితీరు ఎలా ఉంది? జనాలు ఏమనుకుంటున్నారు?

2024 Elections Opinion Polls: ఏబీపీ సీఓటర్ చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే తీరు పట్ల జనాలు కాస్త సంతృప్తికరంగానే ఉన్నట్లుగా తేలింది.

Continues below advertisement

ABP CVoter Survey: ఎంతో ఉత్కంఠ నడుమ జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో.. ఇప్పుడు దేశ ప్రజల కన్ను సార్వత్రిక ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోపు జరుగుతాయని భావిస్తున్న ఈ లోక్ సభ ఎన్నికల్లో జాతీయంగా ఏ పార్టీ సత్తాచాటుతుందా? అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. ఇంకో మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం అప్పుడే జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 

Continues below advertisement

ఇటీవల న్యూదిల్లీలో జరిగిన I.N.D.I.A కూటమి నాలుగో సమావేశంలో తమ ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరును త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు. 

ఇలాంటి రాజకీయ పరిస్థితుల మధ్య ఏబీపీ సంస్థ సీఓటర్ తో కలిసి చేసిన సర్వేలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏబీపీ సీఓటర్ చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే తీరు పట్ల జనాలు కాస్త సంతృప్తికరంగానే ఉన్నట్లుగా తేలింది. ఈ సర్వే ప్రకారం.. దాదాపు 39 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పని తీరు పట్ల అసంతృప్తికరంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మరో 26 శాతం మంది చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 21 శాతం మంది మాత్రం తాము తక్కువ సంతృప్తికరంగా ఉన్నామని చెప్పారు. 14 శాతం మంది తమకు దీని గురించి తెలియదని అన్నారు.

మల్లిఖార్జున ఖర్గేపై ప్రజాభిప్రాయం ఇదీ..
ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. చాలా మంది ఖర్గే పనితీరు పట్ల అసంతృప్తికరంగానే ఉన్నారు. దాదాపు 35 శాతం మంది ఖర్గే పనితీరు పట్ల అసంతృప్తికరంగా ఉండగా.. 20 శాతం మంది తక్కువ సంతృప్తికరంగా ఉన్నారు. 15 శాతం మంది మాత్రం సంతృప్తికరంగా ఉన్నారు. మరో 30 శాతం మంది తమకు తెలియదని చెప్పారు.

I.N.D.I.A కూటమిపై ప్రజాభిప్రాయం ఏంటి?
సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. I.N.D.I.A కూటమిలో ఐకమత్యం ఉంటుందని చాలా మంది విశ్వసించడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకైనా I.N.D.I.A కూటమిలో ఉన్న పార్టీ మధ్య ఐకమత్యం ఉంటుందా అని 50 శాతం మంది అనుమానం వ్యక్తం చేశారు. I.N.D.I.A కూటమి నిలకడగా ఉంటుందనే విషయంలో చాలా మంది ఈ సర్వేలో పాల్గొన్న పౌరులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]

Continues below advertisement
Sponsored Links by Taboola