Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,768 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.11 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 







  • మొత్తం కేసులు: 4,44,72,241

  • యాక్టివ్ కేసులు: 49,636

  • మొత్తం మరణాలు: 5,28,121

  • మొత్తం రికవరీలు: 4,39,06,972


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 28,09,189 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.55 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,16,504 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కీలక నిర్ణయం


భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్​ మాండవీయ మంగళవారం తెలిపారు.



కరోనాపై యుద్ధంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకా ఇవ్వొచ్చు.                                           "
-మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి


ఒక్కసారి చాలు


భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.





Also Read: Queen Elizabeth Death: క్వీన్ ఎలిజబెత్ 2 గురించి ఈ 10 షాకింగ్ విషయాలు తెలుసా?


Also Read: Queen Elizabeth Dies: ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ - రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్ఞి క్వీన్ ఎలిజబెత్‌-II ఇక లేరు !