IAF Foundation Day: విదేశీ శక్తులను భారత గడ్డపై అడుగుపెట్టనివ్వం: వాయుసేన అధిపతి

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 08 Oct 2021 01:40 PM (IST)

విదేశీ శక్తులను భారత గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరీ అన్నారు.

విదేశీ శక్తులను దేశంలో అడుగుపెట్టనివ్వబోం: ఐఏఎఫ్ చీఫ్

NEXT PREV

89వ భారత వైమానిక దినోత్సవాన్ని ఉత్తర్‌ప్రదేశ్ గజియాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వాయుసేన అధిపతి  వీఆర్ చౌదరీ కీలక ప్రసంగం చేశారు. భారత గడ్డపై విదేశీ శక్తులను కాలుమోపనివ్వబోమని వాయుసేనాని స్పష్టం చేశారు.

Continues below advertisement






ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను చూస్తే.. నేను సరైన సమయంలో వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించినట్లు అనిపిస్తోంది. మన భూభాగంలోకి ఏ విదేశీ శక్తిని కాలుమోపనివ్వబోమని ఈ సందర్భంగా దేశానికి వాగ్దానం చేస్తున్నాను. 






వైమానిక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన వీరులు, వారు కుటంబాలను అభినందించారు. 







వైమానిక దినోత్సవం సందర్భంగా వాయుసేన వీరులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్యం, సాహసం, వృత్తి ధర్మంలో వారికి వారే సాటి. సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని రక్షించడంలో వారి సేవలు ఎనలేనివి.                                            - ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Gurmeet Ram Rahim Convicted: హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 08 Oct 2021 01:30 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.