Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.
కళాశాలల పునఃప్రారంభంపై ధర్మాసనం ఆదేశాలు ఇస్తుంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నంతవరకు విద్యార్థులు ఎవరూ హిజాబ్ లేదా కాషాయ కండువా వంటి మతపరమైన దుస్తులను ధరించి కళాశాలలకు వెళ్లొద్దు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్పై విచారణ కొనసాగిస్తాం. - కర్ణాటక హైకోర్టు
హిజాబ్ వివాదం..
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.
మరోవైపు హిజాబ్కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.
Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో- జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య