Firecracker Ban: దిల్లీలో బాణసంచా అమ్మకాలు, స్టోరేజీపై బ్యాన్

ABP Desam   |  Murali Krishna   |  15 Sep 2021 03:51 PM (IST)

దిల్లీలో వాయుకాలుష్యం కారణంగా ఈ ఏడాది బాణసంచా అమ్మకాలు, స్టోరేజీపై పూర్తి స్థాయి బ్యాన్ విధించింది ఆప్ ప్రభుత్వం.

బాణసంచాపై బ్యాన్

దీపావళికి ముందు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నిరకాల బాణసంచాల అమ్మకాలు, స్టోరేజీపై పూర్తిస్థాయి బ్యాన్ విధించింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు.

దీపావళి కారణంగా దిల్లీలో కాలుష్యం ఈ మూడేళ్లలో మరింత ఎక్కువైంది. అందుకే గత ఏడాదిలానే ఈసారి కూడా అన్నిరకాల బాణసంచాల అమ్మకాలు, కొనుగోలు, వినియోగం, స్టోరేజీపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తున్నాం. దీని ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. -                                    అరవింద్ కేజ్రివాల్, దిల్లీ సీఎం

ట్రేడర్లు బాణసంచాను నిల్వ చేసుకోవద్దని ఈ సందర్భంగా సీఎం సూచించారు. గతేడాది స్టోరేజీ చేసుకోవడం వల్ల వ్యాపారులు నష్టపోయారని గుర్తుచేశారు.

గత ఏడాది ట్రేడర్లు బాణసంచా స్టాక్ తెచ్చుకున్న తర్వాత బ్యాన్ విధించాం. దీని వల్ల వాళ్లు చాలా నష్టపోయారు. అందుకే ఈసారి ముందే చెబుతున్నాం. ఎలాంటి క్రాకర్స్ స్టోరేజీ చేసుకోవద్దు.                                        -     అరవింద్ కేజ్రివాల్, దిల్లీ సీఎం

ఈ ఏడాది నవంబర్ 4న దీపావళి జరుపుకోనున్నారు. దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కార్ వివిధ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో దిల్లీలో కాలుష్యం మరింత ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ, వాయుకాలుష్యం పెరగడంపై వివిధ ఏజెన్సీలతో పలు నివేదికలు దిల్లీ ప్రభుత్వం తెప్పించుకుంది.

వీటిని పరిశీలించిన అనంతరం కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయి ప్లాన్‌ను విడుదల చేస్తామని దిల్లీ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

Published at: 15 Sep 2021 03:48 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.