Earthquake in Delhi:



ఢిల్లీ, ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం నమోదైంది. 4.4 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా,ఢిల్లీ-NCRలో భూమి కంపించడం వల్ల ప్రజలు భయ భ్రాంతులకు లోనయ్యారు. హరిద్వార్‌లోనూ రిక్టర్‌ స్కేల్‌పై 4.4 భూకంపం నమోదైంది. అటు చెన్నైలోనూ మౌంట్‌ రోడ్‌లో భూమి కంపించింది. నేపాల్‌లోనూ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైనట్టు తేలింది. గతేడాది నవంబర్‌లో నేపాల్‌లో 6.3 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది.