ప్రీతి హుడా....లక్ష్యం చేరుకునేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాదని నిరూపించారు. బస్ డ్రైవర్ కుమార్తె అయిన ప్రీతి హుడా దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ లో ర్యాంక్ సాధించింది. సివిల్స్ సర్వీస్ ను మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెన్ అంటారు. అంటే ఆ పరీక్షలో అర్హత సాధించడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. 


అడ్డంకులను దాటి


యూపీఎస్సీ పరీక్షను క్లియర్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఈ పరీక్షను ఛేదించడానికి చాలా సన్నద్ధత, సంకల్పం అవసరం.  ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ UPSC ని క్లియర్ చేయడంలో విజయం సాధించిన సామాన్యులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక ఉదాహరణ ప్రీతి హుడా. ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ IAS అధికారిగా మారింది. ప్రీతి హుడా తండ్రి బస్ డ్రైవర్, కానీ ఆమె కల నెరవేరడానికి ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారాయి. వాటిని అధిగమించి విజయం సాధించింది.


Also Read: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?


చదువు ఆపేయాల్సి వచ్చినా..


ప్రీతి హుడా తన చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండేది. ఆమె 10వ తరగతి పరీక్షలో 77% మార్కులు సాధించింది. 12 వ తరగతి పరీక్షలో 87% మార్కులు సాధించింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె చదువు ఆపేసి, పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ప్రీతి తన చదువును కొనసాగించింది. దిల్లీలోని లక్ష్మీ బాయి కళాశాలలో ప్రవేశం పొంది, హిందీ సబ్జెక్టులో పట్టభద్రురాలైంది. ప్రీతి హిందీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)  పీహెచ్‌డీ కూడా పొందారు. 


Also Read: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..


తొలి ప్రయత్నంలో విఫలం కానీ 


ప్రీతి స్వస్థలం హరియాణా రాష్ట్రం బహదూర్ఘగ్ ప్రాంతం. ఆమె తండ్రి దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఎంతో ప్రణాళికతో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమైంది ప్రీతి. సివిల్స్ లో  హిందీ మీడియాన్ని ఎంచుకుంది. అంతే కాదు హిందీ సబ్జెక్టును ఆఫ్షనల్ గా ఎంచుకుంది. ప్రీతి హుడా తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. అంతటితో నిరుత్సాహ పడకుండా రెండో సారి ప్రయత్నించింది. 2017లో ఆమె సివిల్స్ క్లియర్ చేసింది. 288వ ర్యాంక్ సాధించింది.  


Also Read: సివిల్ సర్వీసెస్ 2020 తుది ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగువారు ఎవరంటే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి