అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్విట్టర్ ఖాతా కోసం కోర్టును ఆశ్రయించారు. ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి పునరుద్ధరించాలని కోరారు. ఫ్లోరిడాలోని ఫెడరల్‌ కోర్టులో ఈ విచారణ జరిగింది. 


కాంగ్రెస్ సభ్యులు చేసిన ఒత్తిడి వల్లే తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ట్రంప్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ ఖాతాల శాశ్వత పునరుద్ధరణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పిటిషన్ వేశారు ట్రంప్. ఫేస్​బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలపై జులైలోనే వ్యాజ్యం దాఖలు చేశారు ట్రంప్. యూజర్లపై సెన్సార్​షిప్ విధిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోందని పేర్కొన్నారు.


అయితే ఈ వాదనను ట్విట్టర్ ఖండించింది. తాము చేసిన విజ్ఞప్తిపై ట్రంప్‌ వెంటనే స్పందించలేదని కోర్టుకు తెలిపింది.


జనవరి 6వ తేదీన అమెరికాలో ట్రంప్‌ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఆ ఘటనను ప్రేరేపించేలా ట్రంప్‌ పోస్టులు ఉన్నాయని ఆరోపిస్తూ ట్విట్టర్ అతడి ఖాతాను నిషేధించింది. ఆ తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌ కూడా ట్రంప్‌ ఖాతాలపై పలు చర్యలు తీసుకున్నాయి. బ్యాన్ సమయంలో ట్విట్టర్​లో ట్రంప్​నకు 8.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి