Delhi Excise Duty Scam:


మరోసారి సమన్లు..


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మరోసారి హాజరు కావాలని వెల్లడించింది. ఇదే విషయాన్ని సిసోడియా ధ్రువీకరించారు. ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు. 


"సీబీఐ నుంచి నాకు మరోసారి పిలుపు వచ్చింది. సీబీఐతో ఈడీలకు పూర్తి అధికారాలు ఇచ్చి నాపైకి వదులుతున్నారు. నా ఇంటిని సోదా చేశారు. బ్యాంక్ లాకర్‌నూ సెర్చ్ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఢిల్లీలోని విద్యార్థులకు మంచి చదువు అందాలని ఎన్నో చర్యలు తీసుకున్నాను. అందుకే వాళ్లు నన్ను నియంత్రించాలని చూస్తున్నారు. నేను ఇప్పటి వరకూ విచారణకు సహకరించాను. ఇకపైన కూడా ఇదే విధంగా సహకరిస్తాను"
-మనీశ్ సిసోడియా, ఢిల్లీ డిప్యుటీ సీఎం