కొంతమంది దొంగలు దొరికితే బాత్రూంలో పెనాయిల్ కూడా పట్టికెళ్లిపోతారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఓ రైలు ఇంజిన్‌నే దొంగతనం చేశాడు. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? మరదే ట్విస్ట్. ఇంతకీ ఆ వ్యక్తి పని చేసేది కూడా ర్వైల్వేశాఖలోనే. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.


అదెలా?


బిహార్​ పుర్ణియా కోర్ట్​ రైల్వే స్టేషన్​ పరిధిలో ఉన్న సమస్తిపుర్​ లోకో డీజిల్ షెడ్​లో రాజీవ్​ రంజన్​ ఝా అనే అతను ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. అతను పనిచేసే స్టేషన్​లో చిన్నరైల్వే ట్రాక్​పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్​ ఉంది. దానిపై కన్నేసిన రాజీవ్.. పై అధికారులు నుంచి వచ్చినట్లు నకిలీ ధ్రువపత్రాలను సృష్టించేశాడు. 


పాత సామాన్లకు..


నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్ డిసెంబర్ 14న గ్యాస్ కట్టర్​తో రైలు ఇంజిన్​ను ముక్కలుగా చేసేశాడు. ఇందుకు ఓ హెల్పర్ కూడా అతనికి సాయం చేశాడు. కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకునే సరికి నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు. ఇంజిన్​ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్​ షెడ్​కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని వారిని నమ్మించాడు.


ఆ పత్రాల ఆధారంతో ఏకంగా రైలు ఇంజిన్‌ను పాత సామాను కొనుగోలు చేసే వారికి అమ్మేశాడు రాజీవ్. ఇందు కోసం అతనికి స్థానిక పోలీస్​ ఇన్​స్పెక్టర్​, ఓ హెల్పర్ కూడా సహకరించారు.


ఎలా తెలిసింది?


రాజీవ్‌పై స్టేషన్ అధికారులకు అనుమానం రావడంతో డీజిల్​ షెడ్​కు వెళ్లి చూశారు. అక్కడ ఇంజిన్ పరికరాలు లేవు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తమ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెప్పారు. దీంతో స్టేషన్​ మాస్టర్, ఉద్యోగులు కలిసి ఆర్​పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించేసరికి అసలు విషయం బయటకు వచ్చింది.


Also Read: Bridge Theft in Akron: వార్ని.. ఏకంగా వంతెన్నే ఎత్తుకెళ్లిన దొంగలు, ఇంత కక్కుర్తి ఏంట్రా? ట్విస్ట్ అదుర్స్!


Also Read: Modi Absent : లోక్‌సభకు ఒక్క రోజే హాజరైన ప్రధాని మోడీ.. ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు


Also Read: Aishwarya Rai Summoned: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్.. పనామా పత్రాల కేసులో ప్రశ్నల వర్షం


Also Read: New Year 2022: న్యూ ఇయర్ వేడుకలకు ఇండియాలో టాప్ 11 ప్రదేశాలివే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి