Lakhimpur Violence: 'లఖింపుర్ ఘటనను హిందూ X సిక్కుగా మార్చే ప్రయత్నాలు'

ABP Desam   |  Murali Krishna   |  10 Oct 2021 04:32 PM (IST)

లఖింపుర్ ఘటనను హిందు, సిక్కుల మధ్య గొడవగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భాజపా నేత వరుణ్ గాంధీ ఆరోపించారు.

లఖింపుర్ ఖేరీ ఘటనపై వరుణ్ గాంధీ వ్యాఖ్యలు

లఖింపుర్ ఘటనను ఉపయోగించుకుని హిందువులు, సిక్కుల మధ్య విబేధాలు సృష్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు భాజపా నేత వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

లఖింపుర్ ఘటనను హిందు X సిక్కుల గొడవగా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా తప్పు మాత్రమే కాదు ప్రమాదం కూడా. మానిపోయిన గాయాలను మళ్లీ తిరిగి తేవాలని చూస్తున్నారు. ఇవి మళ్లీ మానడానికి తరాలు చాలవు. జాతీయ సమైక్యత కంటే ఈ రాజకీయ ప్రయోజనాలకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వకూడదు.                                    - వరుణ్ గాంధీ, భాజపా నేత

సంచలన వ్యాఖ్యలు..

లఖింపూర్ ఘటనపై వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, నిరసనకారులపైకి కారు దూసుకెళ్లిన వీడియోను పోస్ట్ చేశారు. నిరసనకారుల గళాన్ని హత్యల ద్వారా నొక్కకూడదన్నారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీతనం ఉండాలని ట్వీట్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు. 

లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు సిక్కులు ఉన్నారు. బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర సింగ్ సిక్కులకు గుర్ముఖి లిపిలో ఓ లేఖ రాశారు. ఈ సంఘటన అనంతరం సంయమనం పాటించినందుకు సిక్కులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘటనను ప్రభుత్వం, ప్రజలు సహా అందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: హైకోర్టు తీర్పు చాలా బాధాకరం... రాజ్యాంగబద్ధంగానే ఇళ్ల పథకం అమలు.... తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని మంత్రులు బొత్స, సుచరిత స్పష్టం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 10 Oct 2021 04:22 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.