Assembly Elections 2022: ఓవైపు భాజపా సీఈసీ భేటీ.. మరోవైపు 2 రోజుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్

యూపీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు మోదీ నేతృత్వంలో భాజపా సీఈసీ భేటీ అయింది. మరోవైపు ఇప్పటికే 2 రోజుల్లో భాజపా నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు.

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై గత రెండు రోజులుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 

Continues below advertisement

కేంద్ర మంత్రులు అమిత్​ షా, అనురాగ్​ ఠాగూర్​, ధర్మేంద్ర ప్రధాన్​, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​లు వర్చువల్​గా హాజరయ్యారు.

రెండు రోజుల్లో..

ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి, రెండో విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 

రాజీనామాల పర్వం..
 
ఓవైపు భాజపా అభ్యర్థుల ఖరారుపై మల్లగుల్లాలు పడుతుంటే మరోవైపు పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. రానున్న రోజుల్లో రాజీనామాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యోగి కేబినెట్ నుంచి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య.. జనవరి 14న భాజపాకు పెద్ద షాక్ తగులుతుందని వ్యాఖ్యానించారు.
 
ఏడుగురు ఔట్.. 

స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే ఆయనతో కలిపి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు భాజపా నుంచి బయటకు వచ్చారు. అటవీ శాఖ మంత్రి ధారా సింగ్ చౌహాన్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే వీరంతా సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నారు.

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola