Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో పేలుడు- ఐదుగురు మృతి

ABP Desam   |  Murali Krishna   |  06 Dec 2022 03:36 PM (IST)

Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు.

అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు

Afghanistan Explosion: అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

ఇదీ జరిగింది

మజర్- షరీఫ్ నగరంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఆయిల్ కంపెనీకి చెందిన కార్మికులతో వెళ్తున్న వాహనంపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ మేరకు బాల్క్ ఉత్తర ప్రావిన్స్‌కు చెందిన పోలీస్ అధికారి మహమ్మద్ ఆసిఫ్ వాజెరి తెలిపారు.

ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో హైరటన్ ఆయిల్ కంపెనీకి చెందిన బస్సు బాంబు పేలుడుకు గురైంది. ఈ ఘటనలో ఐదు మంది కార్మికులు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.                                                            -      పోలీస్ అధికారి

Also Read: Bharat Jodo Yatra: BJP కార్యకర్తలకు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌లు!

Published at: 06 Dec 2022 03:35 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.