Afghanistan crisis: 'అఫ్గాన్ లో అంతా గందరగోళమే.. తరలింపే మా ప్రధాన లక్ష్యం'

ABP Desam Updated at: 27 Aug 2021 06:56 PM (IST)

అఫ్గాన్ పరిస్థితులపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు వివరించారు. అఫ్గాన్ పౌరుల తరలింపు సహా వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అఫ్గాన్ పరిస్థితులపై భారత విదేశాంగ ప్రతినిధి మీడియా సమావేశం

NEXT PREV

అఫ్గానిస్థాన్ లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది. శాంతి, సామరస్యాలు కలిసిన ప్రజాస్వామ్య అఫ్గాన్​ను భారత్ కోరుకుంటున్నట్లు విదేశాంగ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రజల తరలింపుకు సంబంధించి భద్రతాపరమైన అంశాలు ఎలా కొలిక్కి వస్తాయో చూడాలన్నారు. ప్రస్తుతం తమ లక్ష్యమంతా సురక్షితంగా ప్రజలను తరలించడేమనని స్పష్టం చేశారు.











ఏ వర్గం అఫ్గాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. అందుకే ఈ ప్రశ్నపై సమాధానాన్ని దాటవేస్తున్నాం. అయితే అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా పరిశోలిస్తోంది. అఫ్గాన్ పౌరులు విమానాశ్రయం చేరడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఆగస్టు 25 వారిని తీసుకురావాల్సిన విమానం వారు లేకుండానే వచ్చింది.              - అరిందమ్ బాగ్చి, విదేశాంగ ప్రతినిధి


తాలిబన్​ ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వ ఏర్పాటుకు అఫ్గాన్​లో పరిస్థితులు అనుకున్న విధంగా లేవని బాగ్చి సమాధానమిచ్చారు. ప్రజల భద్రత పైనే తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. భారత్​కు వచ్చే అఫ్గాన్​ పౌరులకు కేంద్ర హోంశాఖ ఈ-ఎమర్జెన్సీ వీసాను ప్రకటించిందని తెలిపారు. వీటి కాల వ్యవధి ఆరునెలలు ఉంటుందన్నారు.


Also Read: Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్

Published at: 27 Aug 2021 06:54 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.