Hyderabad News: హైదరాబాద్‌లోని షేక్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. 17 రోజుల క్రితం పడుకున్న ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఐదేళ్ల వయసున్న బాలుడిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే అప్రత్తమైన తల్లిదండ్రులు ఆ బాబును ఆసుపత్రిలో చేర్చించారు. 17 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. కళ్ల ముందే కదలాడే కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.