Gujarat Vadodara bridge collapses : గుజరాత్లోని వడోదర జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 43 ఏళ్ల వంతెన కూలిపోవడంతో మహిసాగర్ నదిలో అనేక వాహనాలు పడిపోయాయి. కనీసం తొమ్మిది మంది మరణించారు మరో తొమ్మిది మందిని రక్షించారు.
వడోదర జిల్లాలోని పద్రా తాలూకాలోని ముజ్పూర్లో ఉన్న ఈ వంతెన ముజ్పూర్ను ఆనంద్ జిల్లాలోని గంభీరతో పాటు మధ్య గుజరాత్ను సౌరాష్ట్రకు కలిపే రహదారిపై ఉంది. ప్రమాదం జరిగిన వీడియోలు బీతావహంగా ఉన్నాయి. వంతెన నుండి ట్యాంకర్ ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. తర్వాత అది నదిలో పడిపోయింది. కనిపిస్తున్నప్పటికీ, నదిలో చిక్కుకున్న ఒక మహిళ తన కొడుకు కోసం సహాయం కోసం కేకలు వేస్తున్నట్లుగా కొన్ని శ్యాలు ఉన్నాయి.
వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కిందపడిపోయినప్పుడు రెండు ట్రక్కులు, ఒక ఈకో వ్యాన్, ఒక పికప్ వ్యాన్, ఒక ఆటో-రిక్షా నదిలో పడిపోయాయని అధికారులు తెలిపారు. వడోదర జిల్లా అగ్నిమాపక , అత్యవసర బృందం, అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) లను సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేయడానికి లోతైన నీటి డైవ్లతో పాటు ప్రమాద స్థలానికి ఒక బృందాన్ని పంపినట్లు NDRF ప్రకటించింది. వంతెన కూలినప్పుడు రెండు మోటార్ సైకిళ్ళు కూడా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు, వారు కూడా నదిలోకి పడిపోయారా లేదా అనే దానిపై నిర్ధారణ లేదని అధికారులు చెబుతున్నారు.
క్షతగా త్రులను వడోదర జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రక్షించి ఐదుగురిలో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడారరు. 43 సంవత్సరాల పురాతనమైన వంతెనను గత సంవత్సరం మరమ్మతులు చేసినట్లుగా అధికార వర్గాలుచెబుతున్నాయి.