ఎండకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాల జాబితాలో పెరుగు ఉంటుంది. వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలంటే పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ ఉన్నాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ పెరుగు తిన్న తర్వాత కొంతమందికి మొటిమలు, చర్మ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో అధిక వేడిగా అనిపించడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. పెరుగులో వేడి చేసే లక్షణాలు కంటే శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి.


ఆయుర్వేదం ప్రకారం, ప్రాచీన భారతీయ వైద్య విధానం ప్రకారం వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. వాత, పిత్త, కఫ దోషాలపై ఆదరపడి ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పెరుగుకి బదులు మజ్జిగ తీసుకోవడం మంచిదని సూచిస్తారు.


పెరుగు శరీరంలో వేడిని ఎందుకు పెంచుతుంది?


శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాల్లో ఎక్కువ, వాత దోషంలో తక్కువ. అందుకే ఏ సీజన్ లో అయినా పెరుగు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వేసవిలో పెరుగు తింటే కొందరికి శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యమని భావించి అధికంగా తీసుకుంటే ముఖంపై మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కానీ పెరుగుని సరైన పద్ధతిలో తీసుకునే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.


పెరుగు తినే మార్గాలు


పెరుగుని వేసవిలో రోజూ తినకూడదు. రాళ్ళ ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులు జోడించుకుని మజ్జిగ రూపంలో మాత్రమే రోజూ తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. పెరుగులో నీటిని కలిపినప్పుడు అది వేడి ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది. పెరుగుకు శీతలీకరణ ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే వేసవిలో దాన్ని తీసుకోవాలని అనుకుంటే అందులో నీరు ఎక్కువగా వేసుకుని మజ్జిగ అన్నం మాదిరిగా చేసుకుంటే తింటే మంచిది. దీని వల్ల శరీరానికి చల్లదనంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరతాయి.


అలాగే పెరుగుని వేడి చేయకూడదు. వేడి  వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినకూడదు. ఎందుకంటే వేడి తగలడం వల్ల అది దాని సహజమైన లక్షణాలని కోల్పోతుంది. కఫ దోషం ఎక్కువగా ఉన్నందున ఊబకాయం ఉన్నవాళ్ళు పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు ఆయుర్వేదం ప్రకారం పండ్లతో కలపకూడదు. సమ్మర్ సీజన్ లో చాలా మంది చేసే తప్పు పెరుగు అన్నంలో మామిడి కాయ కలుపుకుని తింటారు. కానీ ఇది మంచి కలయిక కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?