రంజాన్ సందర్భంగా, ముస్లింలు సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు. ఈ సమయంలో, డయాబెటిస్ ఉన్నవారు ఇఫ్తార్ కోసం ఈ  వంటకాలను ప్రయత్నించవచ్చు.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఈ నెలంతా ఇఫ్తార్ కూడా తింటారు. ఇఫ్తార్ విందు కోసం చాలా రకాల వంటలు చేస్తారు. వీటిలో కొన్ని డయాబెటిస్ బాధితులు తినలేరు. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న ఈ వంటకాలను ప్రయత్నించవచ్చు.

బేక్ చేసిన కూరగాయలతో క్వినోవా సలాడ్

కావలసిన పదార్థాలు:

1 కప్పు కడిగిన క్వినోవా

తరిగిన కూరగాయలు ..క్యాప్సికమ్, చెర్రీ టొమాటోలు, సొరకాయ, వంకాయ ఇలా మీకు నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు.

ఆలివ్ నూనె

వెనీగర్

రుచికి సరిపడా ఉప్పు

మిరియాల పొడి

తరిగిన కొత్తిమీర

చీజ్ (ఆప్షనల్)

తయారు చేసే పద్ధతి

ఓవెన్‌ని 400°F (200°C)కి వేడి చేయండి.

తరిగిన కూరగాయలను ఆలివ్ నూనె, ఉప్పు మరియు మిరియాలపొడి  కలపి, బేకింగ్ షీట్లో వాటిని పరచండి.

కూరగాయలను మెత్తగా అయ్యెంతవరకు 20-25 నిమిషాల పాటు బేక్ చేయండి

క్వినోవాను ఉడికించి, చల్లబరచండి.

ఒక పెద్ద గిన్నెలో, కాల్చిన కూరగాయలతో వండిన క్వినోవా కలపండి.

బాల్సమిక్ వెనిగర్‌ ను కొద్దిగా చల్లండి. కావాలనుకుంటే తాజా కొత్తిమీర, ఫెటా చీజ్‌తో అలంకరించండి.

చల్లగా లేదా గది ఉష్ణోగ్రత వద్ద సర్వ్ చేయండి.

ఉడికించిన కూరగాయలతో కాల్చిన చేప

కావలసిన పదార్థాలు:

తెల్ల చేప ఫిల్లెట్లు (తిలాపియా లేదా కాడ్ వంటివి)

నిమ్మరసం

వెల్లుల్లి పేస్ట్

రుచికి సరిపడా ఉప్పు  మిరియాల పొడి

ఉడకబెట్టిన కూరగాయలు (బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్లు) 

తయారు చేసే పద్ధతి

1. మీడియం-అధిక వేడి మీద గ్రిల్‌ను ముందుగా వేడి చేయండి.

2. ఫిష్ ఫిల్లెట్లకు నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్ , ఉప్పు, మిరియాల పొడి జోడించండి.

3. చేపలను ప్రతి వైపు 4-5 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు గ్రిల్ చేయండి.

4. ఉడికించిన కూరగాయలతో వేడిగా వడ్డించండి.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

లెంటిల్ సూప్

కావలసిన పదార్థాలు:

1 కప్పు మీకు నచ్చిన పప్పు ధాన్యాలు

1 తరిగిన ఉల్లిపాయ 

తరిగిన వెల్లుల్లి

1 తరిగిన క్యారెట్

తరిగిన కొత్తిమీర

4 కప్పులు కూరగాయల ముక్కలు  

1 టీస్పూన్ జీలకర్ర

1 టీస్పూన్ పసుపు

రుచికి సరిపడా ఉప్పు 

నిమ్మకాయ ముక్కలు

తయారు చేసే పద్ధతి

మీడియం మంట మీద ఒక పెద్ద కుండలో కొంచెం ఆలివ్ నూనెను వేడి చేయండి.

తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్ వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. సుమారు 5 నిమిషాలు.

పాత్రలో పప్పు, కూరగాయముక్కలు, జీలకర్ర, పసుపు వేసి, నీళ్లు పోసి మరిగించాలి.

మంటను తగ్గించి, మూత పెట్టి 20-25 నిమిషాలు లేదా పప్పు మెత్తబడే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి.

రుచికి సరిపడా ఉప్పు 

కొత్తిమీర వేసి, నిమ్మరసం పిండుకుని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

Also Read : పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?