వానాకాలంలో సాయంత్రం వేళ మరింత చల్లగా మారిపోతుంది. ఆ వేళలో వేడి వేడిగా పాయ సూప్ తాగితే ఆ కిక్కే వేరు. అందులోనూ వర్షాకాలంలో వైరస్, బ్యాక్టిరియాలు త్వరగా దాడి చేస్తాయి. వాటి దాడి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. మటన్ పాయ సూప్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులువు. 

కావాల్సిన పదార్థాలునల్లీ బోన్స్ - నాలుగుఉల్లిపాయ తరుగు - ఒక కప్పుపసుపు - చిటికెడుఅల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూనులుటోమాటో ప్యూరీ - అరకప్పుమిరియాల పొడి - అర చెంచాదాల్చిన చెక్క - రెండు ముక్కలుయాలకులు - రెండులవంగాలు - అయిదుధనియాల పొడి - పావు చెంచాకారం - ఒక స్పూనుజాజికాయ పొడి - చిటికెడుబిర్యానీ ఆకులు - రెండుఉప్పు - రుచికి సరిపడానూనె - తగినంత

తయారీ ఇలా1. నల్లీ బోన్స్ శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేయాలి.  ఉల్లి తరుగును మూడు భాగాలుగా చేసి పెట్టుకోవాలి. 2. అదే కుక్కర్లో  నాలుగు స్పూన్ల ఉల్లిపాయ తరుగు, కాస్త నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, గ్లాసున్నర నీళ్లు, పసుపు, ఉప్పు కలిపి వేసి బాగా కలపాలి. 3. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఉడికించాలి. మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే లోపలి  మిశ్రమం మెత్తగా అవుతుంది. 4. ఇప్పుడు మిక్సీ జార్లో మిగతా ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి కాస్త నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా చేసుకోవాలి. 5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక బిర్యానీ ఆకులు, ఉల్లి తరుగు వేసి వేయించాలి. 6. మిక్సీలో మనం ముందే రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించాలి. తరువాత టమోటా ప్యూరీ కూడా వేయించాలి. 7. అన్నీ వేగాక కారం, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి. 8. తరువాత కుక్కర్లోని నల్లీ బోన్స్ మిశ్రమాన్ని, నీళ్లను కూడా వేసి కలపాలి. 9. దీన్ని చిక్కగా అయ్యేవరకు మరిగించుకోవాలి. 10. స్టవ్ కట్టే  ముందు పైన కొత్తిమీర చల్లుకోవాలి. 

Also read: ఆ రాష్ట్రాల్లో ప్రజల చర్మం మంటలకు కారణం ఈ కీటకమే, కుట్టకుండానే మండిపోయేలా చేస్తుంది

Also read: రాత్రి ఎనిమిది తరువాత తినకూడని ఆహారాలు ఇవే, తింటే ఈ సమస్యలు తప్పవు

Also read: వానాకాలంలో అరటి పండ్లు తినొచ్చా? పిల్లలకు పెట్టొచ్చా?