నియాండర్తళ్ళు.. యురేషియాలో సుమారు 40వేల సంవత్సరాల క్రితం వరకు నివసించి, అంతరించిపోయిన పురాతన మానవుల జాతి.  వలస వచ్చిన ఆధునిక మానవులతో పోటీ పడలేక, లేదంటే శీతోష్ణస్థితుల్లో వచ్చిన పెను మార్పులు, లేదంటే పలు రకాల వ్యాధుల మూలంగా ఈ జాతి అంతరించిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. DNA అధ్యయనాల్లో 1,82,000 సంవత్సరాల క్రితం నుంచి 80,000 సంవత్సరాల క్రితం వరకు నియాండర్తళ్ళు జీవించి ఉండొచ్చని తేలింది. నియాండర్తళ్ళు అంతరించి పోవడానికి గల కారణాలపై పరిశోధనలు విస్తృతంగా కొనసాగాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో పలు కీలక విషయాలు వెల్లడి అవుతూనే ఉన్నాయి.  


న్యూరాన్ల ఉత్పత్తిలో తేడా ఎందుకు?


ఒకే జన్యు పరివర్తనతో ఆధునిక మానవులకు నియాండర్తళ్ళు దగ్గరి బంధువులుగా గుర్తించారు. అయితే, నియాండర్తళ్ళ తో పోల్చితే ఆధునిక మానవులలో ఎక్కువ న్యూరాన్‌లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉందని తేలింది. మెదడు అభివృద్ధి సమయంలో మెదడు పరిమాణంతో పాటు న్యూరాన్ ఉత్పత్తిలో పెరుగుదల మానవ పరిణామ సమయంలో సంభవించినట్లు తేలింది. దీని మూలంగానే గత తరాలతో పోల్చితే కొత్త తరాల వారిలో మేధోశక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నియాండర్తళ్ళు, ఆధునిక మానవులు ఇద్దరికీ ఒకే పరిమాణంలో మెదడు అభివృద్ధి జరిగినప్పుడు.. ఇరువురిలో న్యూరాన్ ఉత్పత్తి పరంగా ఎలా తేడాలు వచ్చాయనే అంశంపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.   


మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ (MPI-CBG) పరిశోధకులు న్యూరాన్ ఉత్పత్తి విషయంలో తేడాల గురించి కీలక పరిశోధన చేశారు. TKTL1 ప్రోటీన్ కు సంబంధించి ఆధునిక మానవ రూపాంతరం, నియాండర్తల్ వేరియంట్ నుంచి ఒకే అమైనో ఆమ్లం ప్రోటీన్‌ల బిల్డింగ్ బ్లాక్‌లను పెంచుతుందని కనుగొన్నారు. ఆధునిక మానవ మెదడు పుట్టుకకు కారణంమైన కణాల రకం బేసల్ రేడియల్ గ్లియా. ఈ  బేసల్ రేడియల్ గ్లియల్ కణాలు అభివృద్ధి చెందుతున్న నియోకార్టెక్స్‌ లో మెజారిటీ న్యూరాన్‌ లను ఉత్పత్తి చేస్తాయి. ఇది మెదడులోని అనేక జ్ఞాన సామర్థ్యాలకు అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.   


నియాండర్తళ్ళు కంటే ఆధునిక మానవులలో న్యూరాన్ల ఉత్పత్తి ఎక్కువ


మానవ పిండం అభివృద్ధి సమయంలో న్యూరాన్ల ఉత్పత్తి నియాండర్తళ్ళ కంటే ఆధునిక మానవులలో ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ న్యూరాన్ ల ఉత్పత్తి జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది ఆధునిక మానవుల విజ్ఞాన సామర్థ్యాలను ప్రోత్సహించి ఉండవచ్చన్నారు. అందుకే ఆధునిక మానవులు పరిణామ క్రమాలను దాటుకుంటూ ముందుకు సాగగా.. నియాండర్తళ్ళు అంతరించిపోయి ఉంటారని భావిస్తున్నారు.