గోదావరి జిల్లాల్లో పులసకు ఎంత గిరాకీ ఉందో, చీరమీను చేపలకు అంతే క్రేజ్ ఉంది. ఇవి ఏడాదిలో రెండు మూడు వారాలే దొరుకుతాయి కాబట్టి ధర కూడా అధికంగానే ఉంటుంది. చేతి వేళ్ల సందుల్లోంచి, వలల రంధ్రాల నుంచి కూడా జారిపోయేంత చిన్నవి ఉంటాయని ఒకప్పుడు వీటిని చీరలతో పట్టేవారట. అందుకే ఈ చేపలకు ‘చీరమీను’ అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ చిట్టి చేపలను గారెల్లా చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే ఇగురు కూడా వండుకుంటే వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఆ టేస్టే వేరు. ఈ చేపలు అన్ని ప్రాంతాల వారు తినలేరు. గోదారి ప్రాంత వాసులకు చీరమీను అధికంగా దొరుకుతుంది.
చీరమీను గారెలుకావాల్సిన పదార్థాలుచీరమీను - ఒక కిలోపసుపు - పావు స్పూనుకారం - నాలుగు స్పూన్లుఉప్పు - రుచికి సరిపడాఉల్లిపాయ - ఒకటిపచ్చిమిర్చి - మూడు శెనగ పిండి - నాలుగు స్పూన్లుబియ్యంపిండి - ఆరు స్పూన్లునూనె - వేయించడానికి సరిపడాధనియాల పొడి - రెండు స్పూన్లుజీలకర్ర పొడి - ఒక స్పూనుఅల్లం తరుగు - రెండు స్పూన్లు
తయారీ ఇలా1. చీరమీను చేపలు ఓసారి శుభ్రంగా కడగాలి. 2. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. 3. అందులోనే శెనగపిండి, బియ్యంపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం తరుగు వేసి కలపాలి. 4. చివర్లో చేపలు వేసి కలుపుకోవాలి. 5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 6. నూనె వేడెక్కాక చేపల మిశ్రమాన్ని గారెల్లా ఒత్తుకుని వేయించాలి. 7. రంగు బంగారు రంగులోకి మారాక తీసి ప్లేటులో వేసుకోవాలి. 8. ఏ చట్నీ అవసరం లేకుండానే చేపల గారెలు తినవచ్చు.
.......................................................................
చీరమీను ఇగురు కూరకావాల్సిన పదార్థాలుచీరమీను - ఒక కిలోటమోటాలు - నాలుగుపచ్చిమిర్చి - నాలుగుఅల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూనుపసుపు - పావు స్పూనుఉప్పు - రుచికి సరిపడాకారం - రెండు స్పూన్లుఉల్లిపాయలు - రెండు గరం మసాలా - అరస్పూను
తయారీ ఇలా1. చీరమీను చేపలను ఉప్పు, పసుపు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. 2. ఇప్పుడు ఆ చేపల్లో కారం, పసుపు, ఉప్పు వేసి పదినిమిషాలు మారినేట్ చేయాలి. 3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. 4. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. 5. సన్నగా తరిగిన టమోటా వేసి బాగా కలపాలి. 6. టమోటా మెత్తగా అయి ముద్దలా మారేవరకు ఉడికించాలి. 7. టమోటా మెత్తగా ఉడికాక అందులో గరం మసాలా కలపాలి. 8. చివర్లో మారినేట్ చేసిన చేపలు వేసి మెల్లగా కలపాలి. 9. కూర ఇగురులా మారాక స్టవ్ కట్టేయాలి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
Also read: పిల్లలు తలనొప్పి అంటున్నారా? కారణాలు ఇవి కావచ్చు, తేలికగా తీసుకోకండి