TS TET 2024 results: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET Result) ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.


టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.


తెలంగాణ టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థులకు బంపరాఫర్..
టెట్-2024లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా టెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రేవంత్ సర్కార్ కల్పించింది .


రాష్ట్రంలో మే 20 నుంచి జూన 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సారిసగా ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని జూన్ 3న అధికారులు విడుదల చేశారు. దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్‌ కీని రూపొందించింది. జూన్ 12న ఫైనల్‌ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 






అర్హత మార్కులు..
టెట్ పరీక్షలకు సంబంధించి 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 నిర్వహించారు. ఒక్కో పేపరులో 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 5 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు- 30 మార్కులు కేటాయించారు. ఇక పేపర్-1లో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో మొదటి మూడు విభాగాల్లో 30 ప్రశ్నలు- 30 మార్కులు, నాలుగో విభాగానికి 60 ప్రశ్నలు - 60 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో అర్హత మార్కులను 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.


జూన్ 20 వరకు డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం.. 
తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2024 దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా... జూన్ 20తో గడువు ముగియనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 31 వరకు టీఎస్ డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా 37,700 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 2.14 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడితే.. డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..