విజయవాడలోని తెలుగు అకాడమీ పేరుతో 234 ఉద్యోగాల భర్తీకి వివిధ వెబ్‌సైట్‌లలో ఇటీవల చలామణిలోకి వచ్చిన నోటిఫికేషన్ నకిలీదని తెలుగు-సంస్కృత అకాడమీ సంచాలకులు వి.రామకృష్ణ శుక్రవారం (ఏప్రిల్ 7న) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలాంటి నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అ్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీ పేరుతో ఒక ఫేక్ వెబ్‌సైట్‌ను సృష్టించి అందులో ఆ నకిలీ నోటిఫికేషన్‌ను అందుబాటు ఉంచారు.


తెలుగు అకాడమీ, విజయవాడ పేరుతో ఇటీవల ఒక నోటిఫికేషన్ బయటకొచ్చింది. అకడమిక్ సర్వీసెస్‌లో 78 పోస్టులు, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌లో 156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఓ ఫేక్ నోటిఫికేషన్ ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యూలేట్ అవుతున్న అవుతోంది.  అన్ని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారు. దరఖాస్తు ఫీజు రూ.500గా ప్రకటించారు.


ఎలాంటి రాత పరీక్ష లేకుండా నియామకాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సందేహాలు తలెత్తిన కొంత మంది అభ్యర్థులు ఈ విషయాన్ని అకాడమీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే  స్పందించిన సిబ్బంది విజయవాడ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పాటైన తెలుగు అకాడమీకి ఇంకా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయలేదని, ఏ రకమైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రకటనలో డైరెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Also Read:


తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.  విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...