Telangana TET Notification | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET - Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. డీఎస్సీ (DSC) ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి కావడంతో ఈ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx

Continues below advertisement

టెట్ ముఖ్యమైన తేదీలు, వివరాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి, పరీక్ష ఫీజును చెల్లించడానికి ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

టీజీ టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్లను జూన్ మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేయనుండగా జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో టీజీ టెట్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు సెషన్ 2లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

ఎగ్జామ్ ఫీజు..

టెట్ అభ్యర్థులు ఒక ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులతో పాటు ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులకు రాయితీ కల్పించారు. పూర్తి వివరాల కావాలంటే అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలి.

టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి నుంచి 5వ తరగతి వరకు క్లాసులు చెప్పాలనుకునే వారు పేపర్-1, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. గతంలో టెట్ సర్టిఫికేట్ చెల్లుబాటు గడువు ఏడేళ్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం దానిని జీవితకాలం (Lifetime Validity) చేసింది. దీంతో ఒక్కసారి అర్హత సాధిస్తే సరిపోతుంది. అయితే స్కోరు పెంచుకోవాలనుకునే వారు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అభ్యర్థులు సిలబస్, పరీక్ష విధానంపై పూర్తి వివరాలు తెలుసుకుని ప్రిపేర్ కావాలని విద్యాశాఖ సూచించింది.