Podharillu Serial Today Episode: గాయత్రి పెళ్లిచేసుకోవడానికి గుడికి రానని తెగేసి చెప్పడంతో మహాలక్ష్మీ ఉసూరుమంటూ చక్రి, కేశవ్ను తీసుకుని వెనక్కి వచ్చేస్తుంది. గాయంత్రి రాకకోసం గుడి వద్ద మాధవ్ ఎదురుచూస్తూ ఉంటాడు. చక్రివాళ్ల కారు రాగానే కన్నా చాలా ఆనందపడిపోతాడు. మహా,చక్రి కారులో నుంచి దిగగానే గాయత్రి లోపల ఉండి ఉంటుందని అనుకుంటాడు. కానీ గాయత్రి తమను మోసం చేసిందని.... చివరి నిమిషంలో రాకుండా ఎగ్గొట్టిందని చక్రి చెబుతాడు. అలా ఎలా చేసిందని కన్నా అడుగుతాడు.తను చెబితేనే కదా ఈఏర్పాట్లన్నీ చేసిందని అంటాడు. అది ఎప్పుడూ ఆలా చేస్తుందని మాకు ముందే తెలుసని మండిపడతాడు. కానీ మాధవ్ మాత్రం...గాయత్రి అలా చేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుందని అంటాడు. నువ్వు ఇలా పిచ్చి నమ్మకాలు పెట్టుకోబట్టే....అది నిన్ను ఇలా పిచ్చివాడిని చేసిందని చక్రి మండిపడతాడు.
అసలు నువ్వు అంటే తనకు ప్రేమలేదని....అందుకే పెళ్లికి రాలేనని చెప్పిందని మహా చెప్పి ఏడుస్తుంది.ఇదంతా నావల్లే జరిగిందని పెద్దికి చేతులెత్తి దండం పెట్టి క్షమించమని కోరుతుంది.దీంతో మాధవ్ అది తప్పుచేస్తే నువ్వు ఎందుకమ్మా బాధపడతావు అని అంటాడు. అది చేసిన పనికన్నా...ఇప్పుడు నువ్వు చేస్తుందే నాకు చాలా బాధగా ఉందని అంటాడు.అయినా నువ్వు మంచిపనే చేశావని అంటాడు.అసలు గాయత్రి మనసులో ఏం ఉందో కూడా ఇప్పుడు తెలిసిందని అంటాడు.లేకపోతే నేను జీవితాంతం బాధపడాల్సి వచ్చేదని చెబుతాడు.ఇప్పుడు తనకు నేనంటే ఇష్టంలేదని తెలిసింది కాబట్టి....తను ఎవరిని పెళ్లిచేసుకున్నా నాకు సంతోషంగా ఉంటుందని చెబుతాడు.గుడిమూసివేసే వేళ అయ్యిందని...ఈ పెళ్లి జరుగుతుందాలేదా అని పంతులుగారు అడగ్గా....క్యాన్సిల్ అయ్యిందని చెబుతారు. దీంతో అతను తాళిబొట్టు తెచ్చి ఇచ్చేస్తాడు.
ఉదయం కన్నా,కేశవ్ ఇద్దరూ చక్రికి,మాధవ్కు ఫోన్చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పడంతో వాళ్ల హడావుడిగా వచ్చేస్తారు. ఏం జరిగిందని చెప్పగా...మహా లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని తీయడంలేదని చెబుతారు. అందుకే మిమ్మల్ని పిలిచామని చెబుతారు.దీంతో మాధవ్ గట్టిగా తలుపులుకొట్టడంతో మహా ఏడుస్తూ బయటకు వస్తుంది. నేను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నానని....మిమ్మల్ని అనవసరంగా బాధపెట్టానని ఏడుస్తుంది.నావల్లే ఇదంతా జరిగిందని మళ్లీ బాధపడుతుంది.మీరు గాయత్రి గురించి చెబుతున్నా వినకుండా నేనే గుడ్డిగా నమ్మి మోసపోయానని అంటుంది.అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టానని చెబుతుంది. అయినా గుడిలోనే చెప్పాంకదా ఇందులో నీ తప్పు ఏంలేదని అని మాధవ్ అంటాడు.
మా ఇద్దరి బాధ చూడలేక ఒకటి చేయాలనుకున్నావని...కానీ ఆ గాయత్రి రాకుండా మోసం చేస్తే నువ్వు ఏంచేస్తావని మాధవ్ ఓదార్చుతాడు.మేం ఈవిషయాన్ని గుడిలోనే మర్చిపోయామని నువ్వు దీని గురించి దిగులుపడొద్దని చెబుతాడు. మహాను కొంచెం బయటకు తీసుకెళ్లమని చెప్పడంతో చక్రి తీసుకెళ్తాడు.అయినా మా ఇంటి గురించి మీరు ఇంతలా ఆలోచించడం చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందని చక్రి చెబుతాడు. అలాంటిదేమీ లేదని....మాధవ్కు పెళ్లిచేస్తే ఈ ఇంటికి మరో అమ్మాయి వస్తే ఈ ఇంటికి ఉన్న శాపం పోతుందని...అప్పుడు నేను వెళ్లిపోవచ్చని అంటుంది. అంటే ఇదంతా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి చేస్తున్నారా అని అంటాడు.
గాయత్రి వాళ్ల కుటుంబం నుంచి వివరాలు తెలుసుకునేందుకు పెళ్లికొడుకు బంధువులు విచారణ చేస్తూ...టీ బంకులో టీ తాగుతున్న నారాయణ వద్దకు వచ్చి అడుగుతారు. అమ్మాయి బంగారమే గానీ....వాళ్ల కుటుంబం మంచిదికాదని అంటాడు. వాళ్లనాన్న, అమ్మగురించి చెడుగా చెబుతాడు.అప్పుడే పనికి వెళ్తున్న మాధవ్ అక్కడ ఆగి వాళ్లకు నిజం చెబుతాడు. ఆమె ఎవరో కాదని మా మేనత్తేనని చెబుతాడు.మానాన్నకు వాళ్లకు ఆస్తి గొడవలు ఉన్నాయని అందుకే అన్నీ అబద్ధాలు చెప్పాడని వాళ్లది మంచి సంబంధమేనని చెప్పి వెళ్లిపోతాడు.
