TGPSC Group1 Mains Selection Ratio: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపికచేయాలంటూ ఒకపక్క నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మాత్రం తగ్గేదేలే అంటోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన ఉత్తర్వుల(జీవో నెం. 55, 29)లోని నిబంధనల ప్రకారం 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా..  వారి అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది.


'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ ఆధారంగా మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇటీవల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించాలని కమిషన్‌కు సూచించింది. చట్టానికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ.. వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే దీనిపై నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


అభ్యర్థనల తిరస్కరణకు కమిషన్ చెప్పిన కారణాలు ఇవీ..


➥ ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన 'జీవో నెం.55'ను సవరణ చేస్తూ 'జీవో నం.29' జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయింది.


➥ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. 


➥ ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 


➥ తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ -1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 


➥ ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నం.02/2024లోని పేజి నం.16లోని పేరా 12 లోని పేరా బీ లోనూ 1:50 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. 


➥ ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన 'జీవో నెం.55'ను సవరణ చేస్తూ 'జీవో నం.29' జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయింది.


➥ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. 


➥ ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 


➥ తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ -1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 


➥ ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.


గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...