తెలంగాణ నిరద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ రానుంది. ఇప్పటికే వరుసబెట్టి ఉద్యోగ ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో మరో 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని.. త్వరలోనే మరో 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి కూడా అనుమతులు ఇవ్వనున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు. 


ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ నవంబరు 29న సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. మరో 16,940 పోస్టులకు కూడా త్వరలోనే అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.


Also Read తెలంగాణలో 'గ్రూప్‌-4' ఉద్యోగాల జాతర - 9,168 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!


వచ్చే నెలలో నోటిఫికేషన్లు...


రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా భర్తీ ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు , రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్‌ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సికి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందని పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


Also Read:  TS - పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్!!


తుది దశకు..


సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80వేల ఖాళీలను గడువులోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్ధిక శాఖ అనుమతులతో అన్ని నియామక సంస్థలు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. డిసెంబర్‌ 8 నుంచి పోలీస్‌ నియామక అర్హత అభ్యర్ధుల ఫిజికల్‌ టెస్టులు ప్రారంభం కానుండగా, త్వరలో గ్రూప్‌-1 మోయిన్స్‌ నిర్వహించనున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ను జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.


మొత్తంగా 60,929 పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతులు జారీ చేయడంతో నోటిఫికేషన్ల జారీ దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోంది. మిగిలిన 16940 ఉద్యోగాలకు త్వరలో ఆర్ధిక శాఖ పరిపాలనా అనుమతులకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ మాసంలో గ్రూప్‌2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటిఫికేషన్ల జారీకి వీలుగా టీఎస్‌పీఎస్సీ రోజు సమావేశాలను నిర్వహిస్తోంది. 34శాఖల అధికారులతో సంప్రదింపులతో పోస్టుల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతోంది. 


Also Read: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల! వివరాలు ఇలా! 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...