కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించిన టైర్-2 సీబీటీ పరీక్షల అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో టైర్‌-2 పరీక్షలు జరుగనున్నాయి. 


సదరన్ రీజియన్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


జులై 14 నుంచి 27 వరకు నిర్వహించిన టైర్‌-1 పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 19న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాల్లో మొత్తం 81,695 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి 'టైర్‌-2' పరీక్షలు నిర్వహించనున్నారు. టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టులను బట్టి వేతనం నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100 ఉంటుంది. 


'స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 3న సీజీఎల్-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌ సమయంలో మొత్తం 7,500 ఖాళీలు ప్రకటించగా.. తాజాగా ఆ సంఖ్యను 8,440కు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అదనంగా 940 పోస్టులు చేరినట్లయింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.


టైర్-2 పరీక్ష విధానం..


ALSO READ:


ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..