సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్/యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్‌సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 4103 


ట్రేడుల వారీగా ఖాళీలు..


➥ ఏసీ మెకానిక్: 250


➥ కార్పెంటర్: 18


➥ డీజిల్ మెకానిక్: 531


➥ ఎలక్ట్రీషియన్: 1019


➥ ఎలక్ట్రానిక్ మెకానిక్: 92


➥ ఫిట్టర్: 1460


➥ మెషినిస్ట్: 71


➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 05


➥ మిల్‌రైట్ మెయింటెనెన్స్: 24


➥ పెయింటర్: 80


➥ వెల్డర్: 553


ఎస్‌సీఆర్ యూనిట్లు:
క్యారేజ్ వర్క్‌షాప్లా - లాలగూడ, ఎలక్ట్రిక్ లోకో షెడ్ - లాలాగూడ, ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ - లాలాగూడ, మెయింటెనెన్స్(సికింద్రాబాద్), డీజిల్ లోకో షెడ్-మౌలాలి, ఎంఈఎంయూ కార్ షెడ్ - మౌలాలి, మెయింటెనెన్స్ - హైదరాబాద్, టీఆర్‌డీ - హైదరాబాద్, ఎస్&టీ వర్క్‌షాప్ - సికింద్రాబాద్/ ఖాజీపేట, డీజిల్ లోకో షెడ్ - ఖాజీపేట, ఎలక్ట్రిక్ లోకో షెడ్ - ఖాజీపేట, డీజిల్ లోకో షెడ్ - విజయవాడ, ఎలక్ట్రిక్ లోకో షెడ్ - విజయవాడ, సీ&డబ్ల్యూ డిపో-విజయవాడ, టీఆర్‌డీ - విజయవాడ, మెయింటెనెన్స్ - విజయవాడ, వ్యాగన్ వర్క్‌షాప్ - గుంటుపల్లి, మెయింటెనెన్స్ - గుంటూరు, ఎంఈఎంయూ కార్ షెడ్ - రాజమండ్రి, డీజిల్ లోకో షెడ్ - గుంతకల్, మెయింటెనెన్స్ - గుంతకల్, సీ&డబ్ల్యూ డిపో - గుంతకల్, డీజిల్ లోకో షెడ్ - గుత్తి, సీఆర్ఎస్ - తిరుపతి, జీఎస్ - తిరుపతి, సీడబ్ల్యూ డిపో - తిరుపతి, మెయింటెనెన్స్ - నాందేడ్, సీడబ్ల్యూ డిపో - నాందేడ్, సీ&డబ్ల్యూ డిపో - పూర్ణ.


అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30.12.2022 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.


ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 29.01.2023.


Website 


Notification:



Also Read:


నేషనల్ హైడ్రో-ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు-అర్హతలివే!
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 401 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గేట్, యూజీసీనెట్, క్లాట్ (పీజీ), సీఎం/సీఎంఏ స్కోరు ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలివే!
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎన్ పీడీసీఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్‌బీఐలో 1438 ఉద్యోగాలు, వీరికి బంపరాఫర్! నెలకు రూ.40 వేల వరకు జీతం!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిసెంబర్ 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. 2023, జనవరి 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బ్యాంక్ క్రెడిట్ మానిటరింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...