RRB Technician 2024 Vacancy Increased: రైల్వే ఉద్యోగార్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త తెలిపింది. టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 14,298కి చేరింది. గతంలో కేవలం 18 కేటగిరీల్లో పోస్టులను పేర్కొనగా.. తాజాగా మొత్తం 40 కేటగిరీల నుంచి పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా పెరిగిన పోస్టుల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు చేరాయి. అత్యధికంగా ముంబయి జోన్ పరిధిలో 1883, అత్యల్పంగా సిలిగిరి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే ప్రాధామ్యాల నమోదుకు రైల్వేశాఖ అవకాశం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన తాజాసమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 8న విడుదలకాగా.. మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు/నవంబరు నెలల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతంగా ఇస్తారు.


పెరిగిన టెక్నీషియన్ పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


వివరాలు..


🔰 టెక్నీషియన్ పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 14,298


➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 5,154 పోస్టులు


➥ టెక్నీషియన్ గ్రేడ్-III సిగ్నల్: 9,144 పోస్టులు


ఎంపిక విధానం:  సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


రాతపరీక్ష విధానం:  మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం కేటాయిస్తారు. 


➥ టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రంలో జనరల్‌ అవేర్‌నెస్‌ -10 ప్రశ్నలు- 10 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ -15 ప్రశ్నలు- 15 మార్కులు, బేసిక్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ -20 ప్రశ్నలు-20 మార్కులు, మ్యాథమెటిక్స్‌ -20 ప్రశ్నలు-20 మార్కులు, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ -35 ప్రశ్నలు-35 మార్కులు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 


➥ టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రంలో మ్యాథమెటిక్స్‌ -25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ -25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ సైన్స్‌ -40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ -10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. 



ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900.


Notification


Website