PNB SO Recruitment: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఎ, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 350

పోస్టుల కేటాయింపు: యూఆర్- 152, ఈడబ్ల్యూఎస్- 32, ఓబీసీ- 91, ఎస్సీ- 25, ఎస్టీ- 50.

➥ ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 250 పోస్టులు

➥ ఆఫీసర్-ఇండస్ట్రీ (జేఎంజీ స్కేల్-I): 75 పోస్టులు

➥ మేనేజర్-ఐటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్-ఐటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

➥ మేనేజర్-డేటా సైంటిస్ట్(ఎంఎంజీ స్కేల్-II): 03 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్(ఎంఎంజీ స్కేల్-III): 02 పోస్టులు

➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు 

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఎ, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అబ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

రాత పరీక్ష విధానం: పరీక్షకు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పార్ట్ I, పార్ట్ II భాగాలు ఉంటాయి. పార్ట్ Iలో రీజనింగ్ (25-ప్రశ్నలు, 25-మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25-ప్రశ్నలు, 25-మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50- ప్రశ్నలు, 50- మార్కులు) ఉంటాయి. పార్ట్ IIలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50- ప్రశ్నలు, 100- మార్కులు) ఉంటాయి. 

జీతం: నెలకు క్రెడిట్‌ ఆఫీసర్‌, ఇండస్ట్రీ ఆఫీసర్‌కు రూ.48,480 - రూ.85,920, మేనేజర్‌ (ఐటీ), మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌, మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీకు రూ.64,820 - 93,960, సీనియర్ మేనేజర్‌(ఐటీ), సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీకు రూ.85,920 - 1,05,280.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపుర్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్ బెంగాల్‌.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ/ గుంటూరు, వైజాగ్.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2025.

✦ రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..