భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.

వివరాలు...


మొత్తం ఖాళీలు: 284


ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్


విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్‌, ఆర్‌ అండ్‌ ఏసీ, ఎంఎంవీ, టర్నర్, మెషినిస్ట్, ఎంఎం టూల్‌ మెయింటెనెన్స్‌, కార్పెంటర్, కోపా, ప్లంబర్, SMW, వెల్డర్, పెయింటర్.


అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.


వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.


స్టైపెండ్: నెలకు రూ.7,700 - రూ.8,050 వరకు చెల్లిస్తారు.


అప్రెంటిస్‌ కాలవ్యవధి: ఏడాది.


ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.10.2022.
* ధ్రువపత్రాల పరిశీలన: 20.10.2022-28.10.2022.


* ధ్రువపత్రాల పరిశీలన వేదిక: 
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, 
Corporate Learning & Development Centre (CLDC), 
Nalanda Complex, TIFR Road, ECIL, 
Hyderabad - 500 062.


Notification 


Website


ఇవి కూడా చదవండి..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!
భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...