తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 226 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 



వివరాలు...



మొత్తం పోస్టులు: 226 



1) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్: 167  


 


2) డిప్యూటీ మేనేజర్: 39  


 


3) మేనేజర్: 20   


 


ఖాళీల విభాగాలు: మెకానికల్ (గనులు), ఎలక్ట్రికల్ (థర్మల్), ఎలక్ట్రికల్ (గనులు), ఎలక్ట్రికల్ (పునరుత్పాదక శక్తి), సివిల్ (థర్మల్), సివిల్ (గనులు), పౌర (పునరుత్పాదక శక్తి), సైంటిఫిక్ (థర్మల్), జియోలజీ (గనులు), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ (గనులు), ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కెమికల్(గనులు), మేనేజర్, డిప్యూటీ మేనేజర్. 


 


అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా, పీజీ కలిగి ఉండాలి.    


 


వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 32 నుంచి 36 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వివిధ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది. 


 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


 


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.   


 


దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు-రూ.854; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 354.    


 


పే స్కేల్: ఉద్యోగాన్ని బట్టి రూ.60,000 - రూ.2,00,000.


 


ముఖ్యమైన తేదీలు..


 


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25-08-2022.  


 


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 23-09-2022.  


 


ఫీజు, రిజిస్ట్రేషన్ పూర్తయిన వారి దరఖాస్తుకు చివరితేదీ: 24-09-2022. 


 


Notification


 


Online Application


 


Website


 


Also Read:


AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:

DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి(ఎస్‌టిఏ- B),టెక్నీషియన్-A (టెక్-A) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..




Also Read:

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...