మధ్యప్రదేశ్లోలోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్(ఎన్‌సీఎల్) 2023-24 విద్యాసంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్‌/ డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 700 పోస్టులను భర్తీ యేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 03 వరకు దనఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు.. 

మొత్తం ఖాళీలు: 700

* గ్రాడ్యుయేట్‌&డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు

➢ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌(మధ్యప్రదేశ్‌): 225

➢ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌(ఉత్తర ప్రదేశ్): 155

➢ టెక్నీషియన్‌ అప్రెంటీస్‌(మధ్యప్రదేశ్‌): 153

➢ టెక్నీషియన్‌ అప్రెంటీస్‌(ఉత్తర ప్రదేశ్): 167

విభాగాల వారీగా ఖాళీలు..

⏩ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్: 25

⏩ బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 13

⏩ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ: 20

⏩ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్: 30

⏩ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్: 44

⏩ బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 72

⏩ బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్: 91

⏩ బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజినీరింగ్: 83

⏩ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్: 02

⏩ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో డిప్లొమా ఇంజినీరింగ్: 13

⏩ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా: 90

⏩ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా: 103

⏩ మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా: 114

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18-26 సంవత్సరాలు ఉండాలి.

శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.8000 స్టైపెండ్‌గా  చెల్లిస్తారు.

ముఖ్యమైనతేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 03.08.2023.

Notification

Website

ALSO READ:

మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌లో 466 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 466 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఎనిమిదో తరగతి, పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జులై 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

RRC: నార్త్ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial