Trade Apprentice posts: ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 466 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఎనిమిదో తరగతి, పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జులై 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 466


ట్రేడ్లు: డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్‌.


1) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-ఎ): 188


వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 15-19 సంవత్సరాల మధ్య ఉండాలి.


స్టైపెండ్: ఎంపికైనవారికి మొదటి సంవత్సరంలో మొదటి మూడునెలలు నెలకు రూ.3000, తర్వాతి 9 నెలలు నెలకు రూ.6000 చెల్లిస్తారు. తర్వాత రెండో ఏడాది నెలకు రూ.6600 చెల్లిస్తారు.


2) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-బి): 225


వ్యవధి: ఏడాది.


అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 16-21 సంవత్సరాల మధ్య ఉండాలి.


స్టైపెండ్: ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 - రూ.8050 చెల్లిస్తారు.


3) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-బి): 53


వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి.


స్టైపెండ్: ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 - రూ.8050 చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 
ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.07.2023.


➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు 2023.


Notification  


Website


ALSO READ:


హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


RRC: నార్త్ ఈస్ట్రన్‌ రైల్వేలో 1104 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్‌ పరిధిలోని వివిధ యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial