ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త వినిపించింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబరు 26న ఏపీపీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఆర్డర్ నెంబర్ 77 ప్రకారం ఇక నుండి ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4 శాతాన్ని రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. 


ఈ దివ్యాంగుల విభాగంలో చెవిటి వారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం మరియు మానసిక రోగులను ఈ జాబితాలో ప్రభుత్వం చేర్చడం జరిగింది. కానీ ఈ రిజర్వేషన్ లోనూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని పేర్కొనడం విశేషం. 


ఇక వివిధ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులు అయి ఉండాలని తెలిపింది. ఈ మేరకు దివ్యాంగులు కమిషన్ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



ALSO READ:


గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఆఫీస్‌ స్టాఫ్ పోస్టులు
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు 2,3 వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..