ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) సీనియర్ ఆఫీసర్, ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనిద్వారా మొత్తం 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 276 


మెకానికల్ ఇంజినీర్: 57


ఎలక్ట్రికల్ ఇంజినీర్: 16


సివిల్ ఇంజినీర్: 18


కెమికల్ ఇంజినీర్: 43


సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ఆపరేషన్స్ అండ్‌ మెయింటెనెన్స్: 10


సీనియర్ ఆఫీసర్- ఎల్‌ఎన్‌జీ బిజినెస్‌: 02


సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- బయో ఫ్యూయల్ ప్లాంట్ ఆపరేషన్స్: 01


సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్: 01


సీనియర్ ఆఫీసర్- సేల్స్ (రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సేల్స్/ ఎల్‌పీజీ): 05


సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్ ఫ్యూయల్ బిజినెస్: 30


సీనియర్ ఆఫీసర్- ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్‌: 04


ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్- ముంబయి రిఫైనరీ: 02


ఫైర్ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్- విశాఖ రిఫైనరీ: 02


క్వాలిటీ కంట్రోల్ (క్యూసీ) ఆఫీసర్‌: 06


చార్టర్డ్ అకౌంటెంట్స్: 24


లా ఆఫీసర్స్: 09


లా ఆఫీసర్స్- హెచ్‌ఆర్‌: 05


మెడికల్ ఆఫీసర్: 04


జనరల్ మేనేజర్ (ఆఫీస్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీ): 01


వెల్ఫేర్‌ ఆఫీసర్‌- ముంబయి రిఫైనరీ: 01


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: పోస్టుని అనుసరించి 25-50 సంవత్సరాలు ఉండాలి.


దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్ (లా ఆఫీసర్లు/ లా ఆఫీసర్లకు మాత్రమే) తదితరాల ఆధారంగా ఉంటుంది.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023.


Notification


Website


ALSO READ:


నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కర్ణాటక బ్యాంక్‌లో పీవో పోస్టులు, ఎంపికైతే లక్ష రూపాయల జీతం
కర్ణాటక బ్యాంక్‌ దేశంలోని పలుశాఖలలో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పోస్టుల సంఖ్య ప్రకటించకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 చివరితేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..