భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌-కోల్‌కతా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్-2022/2021 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబర్ 10న ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 



వివరాలు..


* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ:  84


విభాగాల వారీగా ఖాళీలు:


1) మైనింగ్: 39 


2) సర్వే: 02 


3) జియాలజీ: 06 


4) కాన్సంట్రేటర్: 06 


5) ఎలక్ట్రికల్: 11 


6) సివిల్: 05


7) మెకానికల్: 12 


8) ఇన్‌స్ట్రుమెంటేషన్: 02 


9) సిస్టమ్: 01


అర్హత: 60 శాతం(ఎస్సీ/ఎస్టీ 55 శాతం) మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. గేట్ - 2022/గేట్ - 2021 స్కోర్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


వయోసడలింపు: ఎస్సీ/ఎస్టీ/ఓబీ సీ/దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: గేట్ స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.500.


 


ముఖ్యమైన తేదీలు..


దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10.10.2022.


దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 31.10.2022


Notification


Website


ఇవి కూడా చదవండి..


UPSC Notification: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...