సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 212.
➦ సబ్ ఇన్స్పెక్టర్
➦ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ సబ్-ఇన్స్పెక్టర్(ఆర్వో): 19 పోస్టులు
➥ సబ్-ఇన్స్పెక్టర్(క్రిప్టో): 7 పోస్టులు
➥ సబ్-ఇన్స్పెక్టర్(టెక్నికల్): 5 పోస్టులు
➥ సబ్-ఇన్స్పెక్టర్(సివిల్- మేల్): 20 పోస్టులు
➥ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్(టెక్నికల్): 146 పోస్టులు
➥ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్(డ్రాఫ్ట్స్మ్యాన్): 15 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21.5.2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 సంవత్సరాల లోపు; ఏఎస్సై పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు ఎస్సై పోస్టులు రూ.35,400 - రూ.1,12,400; ఏఎస్సై పోస్టులకు రూ.29,200 - రూ.92,300.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు…
➥ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.05.2023.
➥ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.05.2023
➥ అడ్మిట్ కార్డ్ విడుదల: 13.06.2023.
➥ రాత పరీక్ష తేదీలు: 24.06.2023 నుంచి 25.06.2023 వరకు.
Also Read:
షార్ శ్రీహరికోటలో 94 టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు- అర్హతలివే!
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వివిధ కేటగిరీ/ విభాగాల్లో టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్/డ్రాఫ్ట్స్మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్టీసీ/ ఎన్ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 291 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు దశల ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. సరైన అర్హతలున్నవారు మే 9 నుంచి జూన్ 9 మధ్య ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..