భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కు చెందిన కోయంబత్తూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కలిక ప్రాతిపదికన వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగ విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


* మొత్తం ఖాళీలు: 16


పోస్టుల వారీగ ఖాళీలు:


1) సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01


2) సీనియర్ రిసెర్చ్ ఫెలో: 03


3) ప్రాజెక్ట్ అసోసియేట్: 02


4) సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో: 02


5) జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో: 05


6) ప్రాజెక్ట్ అసిస్టెంట్: 02


7) ఫీల్డ్ అసిస్టెంట్: 01


అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్/ డిగ్రీ/ బీఎస్సీ/ పీజీ/ ఎంఎస్సీ/ ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు:


దరఖాస్తు చివరి తేది: 19.09.2022


ఇంటర్వ్యూ తేది: 27.09.2022


ఇంటర్వ్యూ వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, ఆర్.ఎస్.పురం, కోయంబత్తూర్, తమిళనాడు.


Notification 


Website 


 


Also Read:


ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు, నెలకు లక్షకుపైగా జీతం!
AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...