ఆంధ్రప్రదేశ్‌ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి.

కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 29 లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి నవంబరు 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టుల వివరాలు..

* కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్

పోస్టుల సంఖ్య: 08 

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు: గుంటూరు-01, నెల్లూరు-01, కడప-01, చిత్తూరు-03, అనంతపురం-01, కర్నూలు-01.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థ నుంచి డ్రాట్స్‌మ్యాన్( సివిల్) విభాగంలో రెండేళ్ల కోర్సుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి.  (లేదా) సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

జీతం: రూ.34,580 -1,07,210.

రాతపరీక్ష విధానం: 

* మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 

* పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

* పేపర్-2లో ఐటీఐ(సివిల్) విభాగం నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. 

* ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. 

* ఇక 50 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 30 నిమిషాల సమయం కేటాయించారు.  

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

ముఖ్యమైన తేదీలు.. * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2022. * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022.  * దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.11.2022. 

Notification

Online Application

Website

Also Read:

ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులున్యూఢిల్లీ ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలునోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..