కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 



అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.

Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

వివరాలు..


ఖాళీల సంఖ్య: 323

1) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 11 పోస్టులు

2) హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 312 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులను పూర్తిగా ఎస్టీ సామాజిక వర్గానికే కేటాయించారు. ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టులను జనరల్-154, ఈడబ్ల్యూఎస్-41, ఓబీసీ-65, ఎస్సీ-38, ఎస్టీ-14 పోస్టులు కేటాయించారు.

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 

Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వయసు దాకా (ఎస్టీ, ఎస్టీకు 45 సంవత్సరాలు), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు జనరల్ అయితే 3 సంవత్సరాలు, ఓబీసీ అయితే 6 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలు అయితే 8 సంవత్సరాల వరకు వయోసడలింపు కల్పించారు. అదేవిధంగా ఒంటరి అవివాహిత వితంతు మహిళలకు 35 (జనరల్), 38 (ఓబీసీ), 40 (ఎస్సీ, ఎస్టీ) సంవత్సరాల వయసు వరకు వయోసడలింపుకు అవకాశం కల్పించారు. 

జీత భత్యాలు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.29,200 - రూ.92,300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.25,500 - రూ.81,100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్ మెంట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.


Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

రాతపరీక్ష విధానం: 
✪ మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

✪ వీటిలో విభాగం-1: హిందీ/ఇంగ్లిష్-20 మార్కులు,
                విభాగం-2: జనరల్ ఇంటెలిజెన్స్ - 20 మార్కులు,
                విభాగం-3: న్యూమరికల్ ఆప్టిట్యూడ్- 20 మార్కులు,
                విభాగం-4: క్లరికల్ ఆప్టిట్యూడ్-20 మార్కులు,
                విభాగం-5: బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్-20 మార్కులు ఉంటాయి. 

✪ ఆబ్జెక్టివ్ విధానంలోనే మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఓంఎఆర్ షీట్‌లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 

✪ పరీక్షలో కనీస అర్హత మార్కులను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 శాతంగా, ఇతరులకు 35 శాతంగా నిర్ణయించారు.


ముఖ్యమైన తేదీలు..


✪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022.

✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.09.2022.


Notification


Online Application


Website


 


Also More


ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!


టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...